కాచిగూడ : గోల్నాక డివిజన్ కృష్ణానగర్, శాస్త్రీనగర్ మూసీ నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్తచెదారంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టుపక్కల ప్రాంతల్లో దట్టమైనపొగలు వ్యాపిం చాయి. దీంతో కొన్ని గంటల వరకు చుట్టు పక్కల బస్తీ ప్రజలు ఏమి జరుగుతుందోనని భయోందోళనకు గురయ్యారు.
కృష్ణానగర్, శాస్త్రీనగర్ మూసీ నాలాలో ఉన్న థర్మాకోల్, వివిధ రకాల వ్యర్థాలు, చెత్తచెదారం కాలిపోయింది. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ మూసీ నాలాలో ఉన్న వ్యర్థ పదార్ధలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని తెలిపారు.అనంతరం ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో కాచిగూడ పోలీసులు, కృష్ణానగర్, శాస్త్రీనగర్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.