ఎల్బీనగర్ : సంక్రాంతి పండుగను ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. గడ్డిఅన్నారం డివిజన్లోని రెడ్డీ బ్రదర్స్ వీధిలో గడ్డిఅన్నారం టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటుగా గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు పాటిస్తూ పర్వదినాలను జరుపుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత లేకుండా, ఆక్సిజన్ కొరత లేకుండా తగు చర్యలు తీసుకుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రవీణ్, మాజీ కౌన్సిలర్లు కందికంటి ప్రేంనాథ్గౌడ్, జి. రమేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, గడ్డిఅన్నారం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, వర్కింగ్ ప్రసిడెంట్ రమణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు మల్లికారెడ్డి, విజయలక్ష్మీ, పార్వతి, లక్ష్మీ, పద్మ, అరుంథతి, నాగమణి, ఉమ, వరలక్ష్మీ, ఉష, రెడ్డి బ్రదర్స్ యజమానులు ప్రకాష్రెడ్డి, దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.