ఊట్కూర్, జనవరి 7 : రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కొనియాడా రు. మండలంలోని పులిమామిడిలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు ముగ్గులు, ఉపన్యాసం పోటీలు నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అ తిథిగా పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నానని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి పర్చుకోవాలని కోరారు. పాఠశాల విద్యార్థులు మట్టితో తయారు చేసిన ఎద్దుల బండి బొమ్మలను ఎమ్మెల్యేకు బహూకరించారు. ప్రతిభ కనబర్చిన వి ద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. రైతు లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ల క్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, సర్పంచ్ సూరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, వెంకట్రామారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మల్లేపల్లిలో..
మండలంలోని మల్లేపల్లిలో సర్పంచ్ మాణిక్యమ్మ అధ్యక్షతన రైతుబంధు సంబురాలు నిర్వహించారు. అధికారు లు, రైతులు పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషే కం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలస్వా మి, ఏఈవో చరణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
మక్తల్ రూరల్, జనవరి 7 : రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించిన సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. మండలంలోని సామన్పల్లిలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను ఘనం గా నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి వనజాగౌడ్, రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి చే యూత అందించాలనే ఉద్దేశంతో రైతుబం ధు పథకాన్ని అమలు చేశారన్నారు. రైతుబం ధు, రైతు బీమా వంటి పథకాలు దేశానికి ఆ దర్శంగా నిలిచాయన్నారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళలు రంగవల్లికలు వేసి ఘనంగా సంబురా లు నిర్వహించారు. అనంతరం రైతులకు మి ఠాయిలను పంచిపెట్టారు. కార్యక్రమంలో టీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, సర్పంచ్ వెంకటన్న, ఉపసర్పంచ్ పుష్పమ్మ, ఏవో మిథన్ చక్రవర్తి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
మరికల్, జనవరి 7 : రైతుబంధు వారోత్సవాల్లో భాగం గా శుక్రవారం మండలకేంద్రంలోని వైఎస్ఎస్ ఫంక్షన్ హా ల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, రైతుబం ధు మండల కోఆర్డినేటర్ సంపత్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజవర్ధన్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యు డు మతీన్, మండల వ్యవసాయాధికారి శివకుమార్, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, జనవరి 7 : రైతుబంధు సంబురాల్లో భాగంగా ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. బాలు ర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలకు విద్యార్థులు హాజరయ్యారు. పోటీల్లో వివిధ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. మండలంలోని మోడల్ స్కూల్, గోటూర్, కొండాపూర్, కిష్టాపూర్ తదితర గ్రామాల్లో విద్యార్థులకు వ్యాసరచన
పోటీలను ని ర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్కుమార్, ఏఈవో సైమాన్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, విండో వైస్ చైర్మన్ బాలరాజు, టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు సునీల్రెడ్డి, యూత్ మండల ప్రధానకార్యదర్శి వీరేశ్కుమార్, నిర్వాహకులతోపాటుగా ఉపాధ్యాయులు త దితరులు పాల్గొన్నారు.