మనోహరాబాద్, జనవరి 5 : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, రైతులు అడగకముందే రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారని మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు పెట్టుబడి భారం తప్పిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు శివ్వంపేట మండల కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ పురం నవనీతారవి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సర్పంచ్ ప్రభావతి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్, ఏవో స్రవంతి, ఏఈవోలు సచిన్, నరేందర్, ప్రవీణ, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతుల సంబురాలు..
మెదక్ రూరల్, జనవరి 5 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మెదక్ మండలం గుట్టకిందిపల్లిలో వ్యవసాయశాఖ అధికారి లక్ష్మీప్రవీణ్, సర్పంచ్ నర్సవ్వ ఆధ్వర్యంలో రైతులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు. గ్రామంలో మహిళలు ముగ్గులు వేసి బతుకమ్మ ఆడారు. మరోవైపు మక్తభూపతిపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆయా కార్యకమాల్లో రైతుబంధు మండల అధ్యక్షుడు కిష్టయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు భార్గవి, శరణ్య, శేఖర్, రాజశేఖర్, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
చేగుంటలో..
చేగుంట, జనవరి 5 : రైతుబంధు సంబురాలు సంక్రాం తి పండగను తలిపించేలా ఉన్నాయని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాంపూర్లో సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంట చేలల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీటీసీ గణేశ్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్రెడ్డి, రైతుబంధు జిల్లా డైరెక్టర్ మోహన్రెడ్డి, రామాయంపేట ఏడీఏ వసంతసుగుణ, కరీంనగర్ సర్పంచ్ యాదగిరి, గ్రామ రైతుబంధు కమిటీ సభ్యులు సుదర్శన్, ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం..
హవేళీఘనపూర్, జనవరి 5 : సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలిచారని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన హవేళీఘనపూర్ రైతు వేదిక వద్ద రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించి ట్రాక్టర్పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులు గ్రామాల్లో సంబురాలు చేసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏవో నాగమాధురి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు రాజేందర్రెడ్డి, దేవాగౌడ్, మంద శ్రీహరి, మహిపాల్రెడ్డి, యామిరెడ్డి, ఎంపీటీసీ మంగ్యా, ఆయా గ్రామాల సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం కోసం కృషి..
చిన్నశంకరంపేట, జనవరి 5 : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని చందంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బండారు స్వామి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.