చిక్కడపల్లి : ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి వనజా గంగాధరి ఆధ్వర్యంలో గాంధీనగర్లో విద్యార్థులకు బుక్స్,స్టేషనరీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించే బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో ముఠానరేష్, యువనాయకుడు ముఠాజైసింహ, మాజీ కార్పొరేటర్ మాచర్ల పద్మ, డివిజన్ అధ్యక్షుడు ఎరం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, లక్ష్మీ, రాకేశ్, హన్మంతు, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.