యాదాద్రి, జనవరి 8 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం స్వామి, అమ్మవార్ల నిత్యపూజల కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చొని స్వామిని దర్శించుకున్నారు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు నిర్వహించారు. ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, హారతి నివేదించారు. సుదర్శన హోమంతో ఆళ్వారును కొలిచారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు జరిపించారు. ఆలయంలో దర్శనం తక్కువగా ఉండే సమయంలో అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, అంజనేయ స్వామి సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ.13,06,048 వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు. స్వామి వారిని దర్శించుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీవారిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి వేదాశీర్వచనం ఇవ్వగా, అధికారులు ప్రసాదం అందించారు.
శ్రీవారి ఖజనాకు రూ.13,06,048
ప్రధాన బుక్కింగ్ ద్వారా1,81,150
రూ. 100 దర్శనం టిక్కెట్ 16,200
వీఐపీ దర్శనాలు 61,050
వేద ఆశీర్వచనం 6,600
నిత్యకైంకర్యాలు 4,700
ప్రచారశాఖ 22,100
క్యారీబ్యాగుల విక్రయం 11,000
వ్రత పూజలు 76,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 19,800
ప్రసాద విక్రయం 5,89,110
వాహనపూజలు 9,000
టోల్గేట్ 1,650
అన్నదాన విరాళం 7,820
సువర్ణ పుష్పార్చన 1,12,600
యాదరుషి నిలయం 55,940
పాతగుట్ట నుంచి 26,630
ఇతర విభాగాలు 21,398