కొండాపూర్ : మాదాపూర్లోని శిల్పారామంలో కొనసాగుతున్న నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన చేనేత, హస్త కళాకారులు తమతమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. చేనేత, హస్తకళ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నట్లు శిల్పారామం నిర్వహకులు తెలిపారు.
ఎక్స్పోలో భాగంగా విచ్చేస్తున్న సందర్శకులకు ప్రత్యేక ఆహ్లాదాన్ని అందించేందుకు నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనల్లో మంగళవారం ప్రముఖ నాట్య గురువులు ముసునూరి ఇందిరా శిష్య బృందం ప్రత్యేక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
కళాకారులు సాత్విక, యోగితా, ప్రణతి, జాహ్నవి, యుక్త, అక్షిత, సాహితి, వేదశ్రీ, భవాని, లక్ష్మీ సహస్రలు మూషిక వాహన, వినాయకౌతం, బ్రహ్మాంజలి, అదిగో అల్లదిగో, దీపాంజలి, బ్రహ్మమురారి, కుండాపై నృత్యం, కొలువైతివారంగ సాయి, దశావతారం, అల్లోనేరేళ్లో అంశాలను కూచిపూడి నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు.