మక్తల్ టౌన్, డిసెంబర్ 16 : నిరంతరం ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని, మున్సిపల్ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు విడుదలైనట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి పనులు చేపడుతున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తో నియోజకవర్గ సమస్యలపై చర్చించి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మక్తల్, ఆత్మకూర్, అమర్చింత మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారన్నారు. ఒ క్కొక్క మున్సిపాలిటీకి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్ నిధులను సరైన అవసరాలకు ఉపయోగించాలన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలుగరాదు
పడమటి ఆంజనేయస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దేవాలయాధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని రాంలీ లా మైదానంలో ఏర్పడిన గుంతలను జేసీబీ సహాయంతో ఎమ్మెల్యే చదును చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సదుపాయాలు క ల్పించాలని ఆలయ అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యులకు సూచించారు. పోలీసులు ఆలయం ముందు భాగం బస్టాండ్ నుంచి సంగంబండ రోడ్డుపై వెళ్లే వాహనాలు మ ళ్లించాలన్నారు. వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఎ లాంటి ఇబ్బందులు తల్లెత్తకుండా వారికి సరైన స్థలం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో సత్యనారాయణ, మాగనూర్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ రవిశంకర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.