మైలార్దేవ్పల్లి : కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలిపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హజరు శాతం ఎలా ఉన్నదో ప్రధానోపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని, గదులు తక్కువగా ఉన్నాయని మరో 5 గదులు పాఠశాలకు కావాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కోరారు. టీచర్ల సంఖ్య పెంచాలని అడిగారు. పాఠశాల గ్రౌండ్లో ప్రహారి గోడ లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ..పాఠశాల అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని తెలిపారు.తరగతి గదులు,టీచర్ల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకేళ్తానని స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి చెందకుండా విద్యార్థులను భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శానిటైజేషన్ చేసే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాంరెడ్డి, మైలార్దేవ్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ , ప్రేమ్ గౌడ్ , వెంకటేశ్,కాశిగారి యాదగిరి,ఎల్లప్ప,యంజాల మహేష్రాజ్ ,యంజాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.