మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నించిన నిందితులపై ఉచ్చు బిగిస్తున్నది. రూ.కోటిన్నరపైగా విలువైన రెండు ఎకరాలను విక్రయించేందుకు యత్నించిన ‘డూప్లి’కేటుగాళ్లు కటకటాల పాలయ్యారు. ఈ ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి రెవెన్యూ శాఖలో తాత్కాలిక ఉద్యోగి, మిడ్జిల్కు చెందిన ఇద్దరు, మహబూబ్నగర్ వాసులు ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో డొంక కదులుతుండగా.. మరిన్ని ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశంలేకపోలేదు.
మహబూబ్నగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 1వ తేదీన ‘కేటుగాళ్లున్నా రు జాగ్రత్త..’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి విచారణ చేస్తున్నారు. దీంతో మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో అక్రమంగా భూములను విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితులపై ఉచ్చు బిగిస్తున్నది. కొ త్తపల్లిలో రూ.కోటిన్నరకు పైగా విలువ చేసే రెండెకరాలను తమ పేరిట మార్చుకుని వేరే వాళ్లకు విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసు లు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు స మాచారం. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉ న్న తొమ్మిది మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖకు చెందిన ఓ తాత్కాలిక ఉద్యోగి, మిడ్జిల్కు చెందిన ఇద్దరు, మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మిడ్జిల్, మహబూబ్నగర్కు చెందిన ముఠా తమ అక్రమాలకు తాత్కాలిక రెవెన్యూ ఉద్యోగిని వాడుకున్నట్లు సమాచా రం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన సదరు ఉద్యోగి తాను తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నాడని, అక్రమార్కుల నుంచి ఎంత లంచం తీసుకున్నాడో కూడా తెలిపాడని సమాచారం. అయితే, మిడ్జిల్కు సం బంధించిన భూమిని మాయ చేసేందుకు ప్రయత్నించిన సదరు ముఠా గతంలోనూ పలు చోట్ల ఇ లాంటి అక్రమ దందా చేసినట్లు సమాచారం. ఈ-కేవైసీ చేసుకోని వారి భూములనే లక్ష్యం చేసుకుని వీరు వివిధ ప్రాంతాల్లో ఈ దందా చేస్తున్నట్లు స మాచారం. విదేశాల్లో ఉన్నవారు, తమ భూమికి సంబంధించి ఈ-కేవైసీ చేసుకోని వారి వివరాలు తెలుసుకొని అదే పేరు ఉన్న వ్యక్తి ద్వారా ఫోర్జరీ చేసిన ఆధార్ ఆధారంగా వీరు ఈ అక్రమానికి పాల్పడ్డారు. మిడ్జిల్ మండలం కొత్తపల్లికి చెందిన 2.01 ఎకరాల భూమిని మొహమ్మద్ జావీద్ తండ్రి మొహమ్మద్ గౌస్ పేరిట ఉంటే మహబూబ్నగర్ పట్టణానికి చెందిన అదే పేరున్న వ్యక్తి ఆధార్కార్డుతో ఈ-కేవైసీకి దరఖాస్తు చేశారు. వ్యక్తి పేరు అదే అయినా తండ్రి పేరు వేరే ఉన్నది. అయి నా కలర్ జిరాక్స్లో మొహమ్మద్ గౌస్గా చేశారు. తర్వాత ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డుతో భూమినే తన పేరిట మార్చుకున్నాడు. అదే ఫోర్జరీ ఆధార్ కార్డు ద్వారా ఈ-కేవైసీకి దరఖాస్తు చేసుకున్నారు. ధరణి పోర్టల్లో అసలు యజమాని పేరు, ఫొటో తొలగిపోయి నకిలీ వ్యక్తి పేరు వచ్చింది. ఆ త ర్వాత ఆ భూమిని అమ్మకానికి పెట్టి రిజిస్ట్రేషన్ కో సం స్లాట్ కూడా బుక్ చేసుకోగా.. మొహమ్మద్ జావీద్ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించిన జిల్లా కలెక్టర్ అసలు యజమానికి గంటల వ్యవధిలోనే న్యా యం చేశారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలని ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అ సలు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులంతా ఓ ముఠాగా ఏర్పడి గతంలో నూ కొన్ని చోట్ల ఇలాంటి అవినీతి వ్యవహారాలు నడిపారని స్థానికంగా చర్చ నడుస్తున్నది.