తూప్రాన్ రూరల్/ చిన్నశంకరంపేట/నర్సాపూర్/చేగుంట/మెదక్ మున్సిపాలిటీ/రామాయంపేట, జనవరి 7 : కరోనా వ్యాక్సిన్పై ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ మొద టి, రెండో డోస్ టీకాను కచ్చితంగా వేసుకోవాలని రామాయంపేట ప్రభుత్వ వైద్యుడు శివకిరణ్ అన్నారు. శుక్రవారం రామాయంపేటలోని 15నుంచి 18 ఏండ్ల విద్యార్థులకు ప్రభుత్వ దవాఖానలో టీకాలు వేశారు. కరోనా టీకాను కచ్చితంగా తీసుకోవాలని లేకుంటే సీజనల్ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు.
గురుకుల బాలికల పాఠశాలలో ..
జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ వరూధిని, హెల్త్ సూపర్వైజర్ షఫీ ఆహ్మద్ ఆధ్వర్యంలో 14 ఏండ్ల లోపు 244 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్టాఫ్ నర్స్ గీత, ఫార్మసిస్టు ప్రసన్న పాల్గొన్నారు.
చేగుంట మండలపరిధిలోని చందాయిపేట జిల్లాపరిషత్ పాఠశాలలో చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నిబంధనలను పాటించాలని నర్సాపూర్ సీఐ లింగేశ్వర్, ఎస్సై గంగరాజు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోకరోనాపై అవగాహన కల్పించారు. చిన్నశంకరంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి సందర్శించారు. తూప్రాన్ మం డలం సోతరాజుపల్లిలో టీనేజర్లకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.