మహబూబ్నగర్టౌన్, జనవరి 5 : కొ విడ్ వ్యాక్సిన్పై ఎలాంటి అపోహ అవసరంలేదని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మోడల్బేసిక్ ఉన్నత పాఠశాలలో బుధవారం వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ 15ఏండ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా టీకా వేసుకోవాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో 15ఏండ్లు నిండిన విద్యార్థులను గుర్తించి టీకా వేయించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో మ ధ్యాహ్నభోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అలాగే పదోతరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కృష్ణ, ఇమ్యునైజషన్ అధికారి శంకర్, హెచ్ఎం ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేయించుకోవాలి
మిడ్జిల్, జనవరి 5 : అర్హులైన ప్రతిఒక్క రూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ కాంతమ్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్ట ర్ వంశీప్రియ, ఎంపీటీసీ గౌస్, కళాశాల ప్రి న్సిపాల్ వెంకటయ్య, వైద్యసిబ్బంది దేవ య్య, జంగయ్య, గీత పాల్గొన్నారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
జడ్చర్లటౌన్, జనవరి 5 : కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతిఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎం వో విజయకుమార్ సూచించారు. జడ్చర్లలో ని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కోఎడ్యుకేషన్ కళాశాలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ రెండు డోసుల టీకా వేయించుకోవాలని సూచించారు. అలాగే మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమం లో అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్, కౌన్సిలర్ చైతన్యగౌడ్, డాక్టర్ సునీల్, లీల తదితరులు పాల్గొన్నారు.
టీకాతో రక్షణ
మహబూబ్నగర్టౌన్, జనవరి 5 : కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అర్హులైన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని కౌన్సిలర్ కిశోర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్రోజ్ హైస్కూల్లో వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్జీ, వెంకటేశ్, విద్యశ్రీ, నరేందర్, రాణి, బాలరాజు, మణికుమారి పాల్గొన్నారు.