జిల్లా ఓటర్ల సంఖ్య తేలింది. మార్పులు, చేర్పుల అనంతరం తుది ముసాయిదాను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 5,93,699 మంది ఉన్నారు. అందులో పురుషులు 2,98,966 మంది, మహిళలు 2,94,727. ఇతరులు ఆరుగురు. ఆలేరు నియోజకవర్గంలో 2,15,531 మంది, భువనగిరిలో 2,01,509 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు ఆలేరులో నలుగురు, చౌటుప్పల్లో ఇద్దరు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. గతేడాది నవంబరు ఒకటిన వెల్లడించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 635 మంది ఓటర్లు తగ్గారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా ఓటర్ల సంఖ్య తేలింది. మార్పులు, చేర్పుల అనంతరం తుది ముసాయిదాను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం ఓటర్లు 5,93,699 మంది ఉన్నారు. అందులో పురుషులు 2,98,966 మంది, మహిళలు 2,94,727. ఇతరులు ఆరుగురు. ఆలేరు నియోజకవర్గంలో 2,15,531 మంది, భువనగిరిలో 2,01,509 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు ఆలేరులో నలుగురు, చౌటుప్పల్లో ఇద్దరు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. గతేడాది నవంబరు ఒకటిన వెల్లడించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 635 మంది ఓటర్లు తగ్గారు.