బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 19 డిప్యుటీ మున్సిపల్ కమిషనర్ రమేష్, జీహెచ్ ఎంసీ ఈఈ రాజ్కుమార్, కార్పొరేటర్లు, సీఎన్.రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్తో పాటు అన్ని డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొని అభివృద్ది పనులపై చర్చించారు.
వెంగళరావునగర్ డివిజన్ పరిధిలో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు స్థానిక కార్పొరేటర్ దేదీప్యరావు అందజేశారు. కొన్ని కాలనీల్లో వర్షపునీరు నిలుస్తోందని, వాటి పరిష్కారానికి క్యాచ్పిట్స్ నిర్మించాలని కోరారు. దీనికి స్పందించిన ఈఈ రాజ్కుమార్ ఆయా ప్రాంతాల్లో వరదనీటి లైన్ పనులకు నిధులు మంజూర య్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మధురానగర్లో పాడయిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణం కోసం నిదులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు.
వెంగళరావునగర్లో రోడ్లకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని, యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ బీ బ్లాక్లో రోడ్డు పనులు చేపట్టాలని కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ కోరారు. వెంకటగిరి నుంచి కృష్ణానగర్ దాకా భారీ ఎత్తున వస్తున్న వరదనీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 1.95 కోట్లు మంజూరయ్యాయని, 2మీటర్ల వెడల్పుతో బాక్స్టైప్ నాలాను నిర్మించేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మాగంటి పేర్కొన్నారు.
రహమత్నగర్ డివిజన్ పరిధిలో అభివృద్ది పనుల కోసం రూ.7కోట్ల మేర అవసరమవుతుందని ఈ మేరకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కార్పొరేటర్ సీఎన్.రెడ్డి చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాగంటి నిధులు మంజూరు చేయించడంతో పాటు త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. డివిజన్లో సెంట్రల్మీడియన్ వీధిదీపాల పనులు త్వరగా ప్రారంభించాలని కార్పొరేటర్ కోరారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరి ష్కారం కోసం రూ.2కోట్లు కేటాయించడం జరిగిందని, పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి రహ్మత్నగర్ చౌరస్తా దాకా 100 ఫీట్ల రోడ్డు విస్తరణపనులు, స్టేట్ హోమ్ వెనక భాగంలో లింక్ రోడ్డు నిర్మాణం, ఎర్రగడ్డ డివిజన్ నట్రాజ్నగర్ రోడ్డు విస్తరణ, మీటర్ ఫ్యాక్టరీ రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్ల విస్తరణపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటు న్నారని, మెరుగైన లింక్ రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు ఎదురయితే వెంటనే పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా రని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిద డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు కోనేరు అజయ్కుమార్, దుర్గం ప్రదీప్, సంజీవ, కృష్ణమోహన్,అప్పు ఖాన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.