మహేశ్వరం: గ్రామాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పల్లెప్రగతితో గ్రామాలలో ఉన్న సమస్యలు తీరుతున్నాయని అన్నారు.
ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతికి పాటుపడుతూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకున్నపుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం డబిల్గూడ గ్రామ నూతన టీఆర్ఎస్ కమిటీని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డబిల్గూడ సీనియర్ నాయకులు ఏకులరాములు, తొంటరవీందర్, ఇస్తారి, కర్ణాకర్ గ్రామశాఖ అధ్యక్షుడు ధార జంగయ్య, యూత్ అద్యక్షులు బ్రహ్మచారి, ఇంద్రకంటి పాండు పాల్గొన్నారు.