మెహిదీపట్నం : ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు,యువకులకు శారీరక ధారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి పార్కులను అన్నీ రకాలుగా అభివృద్ధి పరుస్తున్నామని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు.
శుక్రవారం ఆసిఫ్నగర్ డివిజన్ హుడాకాలనీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్, కార్పొరేటర్ ఎండీ.మూసాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత పెడదోవ పట్టకుండా క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకోవాలని అన్నారు.
కాలనీలలో,బస్తీలలో ఉన్న పార్కులలో ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో యువకులకు ఎంతో లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ స్సేన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఖాజామొహినుద్దీన్,సయ్యద్ అహ్మద్ రజ్వీమాజీద్,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.