ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్లోని పలు కాలనీలలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి బుధవారం పర్యటించారు. డివిజన్లోని కింతి కాలనీ, వినోబానగర్ తదితర ప్రాంతాల్లో ఆమె స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కింతి కాలనీలో గత మూడు నెలలుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందిపడుతున్నామని స్థానికులు ఆమె దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే అక్కడ బాక్స్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు వినోబానగర్లో పాడైపోయిన రోడ్లను పరిశీలించిన డిప్యూటీ మేయర్ వాటి మరమ్మత్తులకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు రఘు, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు సునీల్ ముదిరాజ్, ఎర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.