చివ్వెంల, జనవరి 3 : ఆగి ఉన్న తుఫాన్ వాహనాన్ని డీసీఏం ఢీకొట్టడంతో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన్నాయక్ తండా వద్ద జాతీయ రహదారి 65పై ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రం శాంతినగర్కు చెందిన గుండెబోయిన సాయి మరో 8మందితో ఏపీలోని కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి తుఫాన్ వాహనం బయల్దేరారు. జగన్నాయక్తండా వద్ద ఏచర్ల ముత్యాలమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు రోడ్డు వెంట వాహనాన్ని నిలిపారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి తుపాన్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో వాహనంలోని గుండెబోయిన సాయి, దుబ్బాక వీరయ్య, ఉప్పెనపల్లి మల్లేశ్, మట్టిపల్లి యశ్వంత్, మట్టిపల్లి యువరాజ్, గడ్డం నారాయణ, గంట పరుశురాములు, జాల లింగయ్య, రెడ్డెబోయిన లింగయ్య, సాయికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విష్ణు తెలిపారు.