ధరూర్, జనవరి 8 : అక్రమార్కుల ధాటికి ప్రకృతి సంపద కనుమరుగవుతున్నది. మండలంలోని జాం పల్లి, దొర్నాల గ్రామాల శివారులోని నెట్టెంపాడు గ్రా విటీ కెనాల్ మట్టిని రాత్రి సమయంలో యథేచ్ఛగా త రలిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భా గంగా ర్యాలంపాడు కోసం తవ్విన అప్రోచ్ కెనాల్ నుంచి జేసీబీల సాయంతో పది రోజులుగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ట్రాక్టర్లతో నూతన గృహలు, వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం రాత్రి 9 నుంచి ఉ దయం 5 గంటల వరకు వందలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. దీంతో కాలువకు ముప్పు పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో ట్రాక్టర్లు అతివేగంగా వెళ్తుండడం తో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ముడుపుల మాయలో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్కు రూ.1500 చొప్పున విక్రయిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. స్థానికుల సమాచారంతో మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నా.. రాజకీయ నాయకులు, ఉ న్నతాధికారుల ఒత్తిళ్లతో వదిలేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలువ పరీవాహక ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూమి చదును, మట్టి తరలింపు చేపట్టాలంటే రెవెన్యూ శాఖ అధికారుల అనుమతి త ప్పనిసరి. కానీ వారు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సా గుతున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో మట్టి తరలింపునకు మైనింగ్శాఖ అనుమతి ఉండాలి. కానీ అక్రమార్కులు అనుమతి లేకుండానే మట్టి తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ లక్ష్యాని కి గండి కొడుతున్నారు. ఇ ప్పటికైనా మట్టి తవ్వకా లు ఆపేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.