వనపర్తి, డి సెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలను శ్రీ కారం చుడుతున్నది. వ్యవసాయాన్ని పండుగ లా మార్చి రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అందుబాటులోకి తెస్తున్నది. పంటల సాగు లెక్క ప క్కాగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. సాగు లెక్కలకు.., పంట డిమాండ్ కు చాలా తేడా ఉండడంతో మార్కెటిం గ్ సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని అధిగమించేందుకు పంటలను జియో ట్యాగింగ్ చేయనున్నది. ఈ విధానాన్ని యాసంగి నుంచి అవలంభిస్తున్నది. అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి పంటల లెక్కలు తేల్చనున్నారు. విత్తనాలు ఎప్పుడు నాటారు..? పంట ఎప్పుడు చేతికొస్తుంది..? అనే విషయాలను కూడా జి యో ట్యాగింగ్ ద్వారా పరిశీలించే వీలు ఉం టుంది. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మానిటరింగ్ చేయనున్నారు. దిగుబడుల వివరాలను ఆన్లైన్లో పక్కాగా పొందుపరుస్తా రు. దీంతో పంట ఉత్పత్తుల సమాచారం ప్రభు త్వం వద్ద కచ్చిత సమాచారం ఉండనున్నది. ఈ విధానాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. యాసంగిలో ఎన్ని రకాల పంటలు.. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు..? నీటి లభ్యత శాతం ఎంత..? అనే అంశాలతో పాటు ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు వేశారనే వాటిపై అధికారులు ఆరా తీయనున్నారు. పంట విస్తీర్ణం, దిగుబడిని అంచనా వేసుకొని మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. పంటకు ఎక్కడ డిమాండ్ ఉందనే అంశాన్ని కూడా రైతులకు సమాచారం అందిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండి.. విస్తీర్ణం తక్కువగా ఉంటే.. ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేసేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. దీంతో అటు రైతులకు.. ఇటు వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా ఉండనున్నది. కొనుగోలు కేంద్రాలు, అవసరమైన సంచులు, మద్దతు ధరకు అనుగుణంగా నిధుల కేటాయింపులపై స్పష్టత వచ్చి ప్రభుత్వం ముందస్తుగా సన్నద్ధమయ్యే వీలుంటుంది. కొనుగోలు చేసిన దిగుబడులకు సరిపడా గోదాంలను అందుబాటులో ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది.
జియో ట్యాగింగ్ ఇలా..
అధికారులు పొలాల్లోకి వెళ్లి ట్యాబ్లతో ఫొటోలు తీసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా పంట విస్తీర్ణం, సాగు ప్రారంభించిన తేదీ వివరాలను గ్రాఫ్ బుకింగ్ పోర్టల్లో నమోదు చేస్తారు. ఈ వివరాలను పరిశీలించేందుకు ఉద్యాన, సీపీవో, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. తప్పుడు వివరాలు నమోదు చేస్తే బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు.