గద్వాల, డిసెంబర్ 15 : రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు పాటు పడుతున్నది. కానీ కేంద్ర ప్ర భుత్వం ఆధ్వర్యంలోని ఎఫ్సీఐ, సీసీఐలు రైతుల జీవితాలను ఆగమాగం పట్టిస్తున్నాయి. పత్తి మార్కెట్లు ఉన్నా.. నిల్వ ఉంచేందుకు గోదాంలు ఉన్నా.. కొనుగోలు చేయడం లేదు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జో గుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి మార్కెట్ ఏర్పాటు చేసింది. కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేయడానికి గోదాంలు కూడా నిర్మించింది. అయినా మార్కెట్లో లావాదేవీలు కొనసాగడం లేదు. దీంతో రైతులు దళారులకు పత్తి విక్రయిం చి మోసపోతున్నారు. అంతేకాకుండా పక్కరాష్ర్టాలైన రాయిచూర్, ఆంధ్ర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. స్థానికంగా మార్కె ట్ యార్డు ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉపయోగం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. గతంలో జిల్లాలో మూడు చో ట్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పత్తి పంట చేతికి వచ్చినా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో మార్కెట్ యార్డుకు వచ్చే ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తున్నది.
జిల్లాలో ఈ ఏడాది అన్ని పంటల కంటే పత్తి అధికంగా సాగు చే శారు. వానకాలంలో 1,81,948 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సు మారు 20 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. పంట చేతికి రావడంతో అమ్ముకోవడానికి ఏ ర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమం లో స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించకపోవడంతో.. రైతులు రాయిచూర్కు, ఎమ్మిగనూర్కు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. చిన్న రైతులు రవాణా చార్జీలు భరించలేక ధర వచ్చినా.. రాకున్నా.. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో దళారులకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా పత్తి మార్కెట్ ఉన్న ప్రాంతంలో దళారులకు పత్తి అమ్మొద్దు. అలా చే యడం వల్ల మార్కెట్కు వచ్చే ఆదాయం కోల్పోతా రు. అయితే, మార్కెటింగ్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే బయటి వ్యక్తులు అనుమతి లేకుండా పత్తి క్రయ విక్రయాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. మార్కెట్ అధికారులు పత్తి కొనేందుకు ట్రేడర్స్ ఏర్పా టు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. రూ.కోట్లతో నిర్మించిన పత్తి మార్కెట్ ఉన్నా.. కేంద్రం నిర్లక్ష్యంతో కొనుగోళ్లు జరగడం లేదు.
రైతులను ఆదుకోవాలి..
మద్దతు ధర కల్పించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో పత్తి మార్కెట్ ఏర్పాటు చేసింది. అయితే, సీసీఐ పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. జిల్లా కేంద్రంలో పత్తి మార్కెట్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. పత్తిని రాయిచూర్కు తీసుకెళ్లి విక్రయిస్తున్నాం. దీంతో రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు సుమారు రూ.2 వేల వరకు అవుతున్నది. త్వరలో కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలి.
కొనుగోళ్లను ప్రారంభించాలి..
జిల్లా కేంద్రంలో ఉన్న పత్తి మార్కెట్లో కొనుగోళ్లు చేస్తే రైతులకు మేలు కలుగుతుంది. మార్కెట్కు కూడా ఆదాయం వస్తుంది. సీజన్ ప్రారంభం కాగానే పత్తి మార్కెట్ ప్రారంభించాల్సి ఉన్నది. కానీ, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పత్తిని గ్రామంలోకి వచ్చిన వారికి లేదా మండల కేంద్రాల్లో దళారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలి.
ఏజెంట్లు ముందుకు రావడం లేదు..
జిల్లాలో గతేడాది రైతుల నుంచి సీసీఐ ద్వారా 1.80 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశాం. ఈ ఏడాది సీసీఐ వారు పత్తి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. రైతులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ట్రేడర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ.. కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే పత్తి మార్కెట్లో కొనుగోళ్లు నిర్వహించలేకపోతున్నాం.