కందుకూరు : కరోనావంటి కష్టాలు భోగి మంటల్లో దహనమవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు కుమారుని పిల్లలు అక్షాయిని, ఇంద్రారెడ్డిలతో కలిసి భోగి మంటలు వేశారు. గంగిరెద్దుకు దండంపెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగా అన్నారు. కరోనా లాంటి కష్టాలు భోగి మంటల్లో కాలి పోవాలని ఆమె ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.