బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా కలకలం రేపుతుంది.గత రెండు మూడు రోజులగా నిరసంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.శానిటేషన్ ఇంచార్జితో పాటు మరో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్గా తెలింది. దీంతో వారందరిని హోం క్వారంటైన్కు తరలించారు.
కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమై కార్పొరేషన్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలలో హైడ్రోక్లోరైడ్ను పిచికారి చేయించారు.అంతే కాకుండా కార్యాలయంలో పని చేసే సిబ్బంది పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. బండ్లగూడ జాగీర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు.