కాచిగూడ : హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నియమితులైన శుభ సందర్భంగా శుక్రవారం మాజీ ప్లోర్లీడర్, టీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా దిడ్డి రాంబాబు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉందని, ఇటీవల పలు ఇతర దేశాల కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కటకం సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.