అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీలో గ్రంథాలయ సంస్థ ఆవరణలో రూ.5.50లక్షలతో చేపట్టనున్న నూతన గది, ఫ్లోర్ నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
గతంలో పాదయాత్ర సందర్భంగా కాలనీ వాసులు గ్రంథాలయలో షెడ్డు నిర్మాణం, ఫ్లోర్ ఏర్పాటు విషయమై తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. వారి కోరిక మేరకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. తొందరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కోశాధికారి శశికుమార్, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కమిటి సభ్యులు అనురాధ, అభిషేక్రెడ్డి, దేవిరెడ్డి అరుణ, ప్రసాద్, సుబ్బారావు, టీఆర్ఎస్ పార్టీ బాగ్అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్, నాయకులు శ్రీరాములుముదిరాజ్, అరున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.