మాదాపూర్ : హఫీజ్పేట్లోని జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో పెండింగ్ పనులతో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హఫీజ్పేట్ జనప్రియ నగర్ కాలనీలోని ఫేస్ 1 లో తలెత్తిన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కాలనీ ప్రజల విన్నపంతో బుధవారం స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ టీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … కల్వర్ట్ అభివృద్ధి పనులను త్వరలోనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. కాలనీలో చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పనలకు కృషి చేస్తానని అన్నారు.
స్థానికంగా నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. చెరువు వద్ద అలుగు నుండి నిర్మించిన వరద నీటి కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసి కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ దీపాల కల్పనకు పెద్దపీట వేస్తు కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి ప్రతాప్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ రజియా బేగం, శాంతయ్య, మల్లిఖార్జున్, ఉమేష్, ఉమా మహేశ్వరరావు, రవి, రాంచెందర్, సురేష్, ఫణి కుమార్, ప్రకాష్, శ్రీనివాస్, వాసుదేవ్, రాంబాబు, ప్రభ, లీల, రాణి, రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.