తెలుగుయూనివర్సిటీ : పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు దిక్సూచిగా విజయానికి దారిది పుస్తకం నిలుస్తుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య టి. కిషన్రావు అన్నారు.
తెలుగువర్సిటీ వీసీ కిషన్రావు సోమవారం తన చాంబర్లో ప్రముఖ విద్వాత్మక సలహాదారు డాక్టర్ సి వీరేందర్ రచించిన విజయానికి దారిది పుస్తకాన్ని ఆవిష్కరణ జరిగింది. ఉన్నత విద్యలను అభ్యసించిన యువత భవితకు బాటలు వేసేందుకు ఈ పుస్తకం పఠన ఎంతో అవసరం అన్నారు.
వీరేందర్ రచనలు విద్యార్థినీ, విద్యార్థులకు మార్గనిర్థేశకం చేస్తున్నాయని ప్రశంసించారు. తెలుగువర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ పాల్గొన్నారు.