చిక్కడపల్లి : సమస్యలు తెలుసుకోవడానికి మీ వద్దకే వచ్చా.. ఇబ్బందులు ఉంటే చెప్పండి.. పరిష్కరిస్తా అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీ పర్యటనలో ప్రజలను పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఆదివారం రాంనగర్ డివిజన్ టీఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.దామోదరెడ్డి ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి ఎల్ఐజీ క్వాటర్స్, పాలమూరు బస్తీలో పాదయత్ర నిర్వహించారు.
బస్తీల్లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐజీలో డ్రైనేజీ సమస్య, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పాలమూరు బస్తీలో కలుత నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, వెంకటకృష్ణ (బబ్లు), హౌస్ఫెడ్ డైరెక్టర్ ఏ.కిషన్ రావు, జనార్దన్, ఆర్.జయదేవ్, కురగాయల శ్రీను, శివకుమార్ యాదవ్, కల్యాణ్ నాయక్, మహేశ్, కల్పన, నితిన్, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.