దేవరకద్ర రూరల్, జనవరి 5 : కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర మండల అధ్యక్షుడు, దేవరకద్ర ఉప సర్పంచ్ కుర్వ రాందాసు కొడుకు వినీత్కుమార్ కొద్ది రోజులు కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రం గా గాయపడి హైదరాబాద్లోని దవాఖానలో చి కిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయా న్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లి రూ.8 లక్షలు మంజూ రు చేయించారు. బుధవారం ఈ సాయానికి సం బంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కును నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ఆల అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సం క్షేమ ఫలాలు పార్టీలకతీతంగా అర్హులందరికీ అందజేస్తామన్నారు. నియోజకవర్గంలోని అందరికీ అందుబాటులో ఉంటూ అర్హులైన వారికి ప్రభుత్వ సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీలకంటే ప్రజల బాగోగులే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.