వన భోజనాలతో ఆధ్యాత్మిక ఆనందం
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నీట్లో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
మియాపూర్, నవంబర్ 27: సీఎం సహాయ నిధితో పేదలకు ఆరోగ్యానికి భరోసా అందిస్తున్నదని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు రూ.2,99,500లు సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను శనివారం తన నివాసంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఆదర్శ్రెడ్డి, చంద్రారెడ్డి, శ్రీను, కాశీనాథ్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందనలు
గచ్చిబౌలి డివిజన్లోని గౌలిదొడ్డి గురుకుల బాలికల పాఠశాల నుంచి నేషనల్ నీట్లో ఎంబీబీఎస్ 225, ఐఐటీ 25 సీట్లు, రాష్ట్ర నీట్లో 14 సహా టాప్ పది ఇంజినీరింగ్ సిట్లు సాధించారు. దీంతో ప్రిన్సిపాల్ శారద, వైస్ ప్రిన్సిపాల్ వెంకటరమణ, విప్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా విప్ వారిని అభినందించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు బాకీ స్వామి, ఎర్ర యాకయ్య, చంద్రారెడ్డి పాల్గొన్నారు.
మయూరీనగర్లో..
ఆధ్యాత్మికతతో సంఘటిత భావాన్ని పెంపొందించేందుకు కార్తిక వన భోజనాలు దోహదపడుతాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కార్తిక మాసం ఎంతో పవిత్రమైనదని, శివయ్య నామస్మరణతో కాలనీవాసులంతా ఒకే వేదికపై కలుసుకోవటంతో ఆనందాన్ని కల్గిస్తాయని అన్నారు. మియాపూర్ డివిజన్లోని మయూరీనగర్లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం కార్తిక వన భోజనాలు నిర్వహించారు. కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నారాయణరావు, ఉపాధ్యక్షులు వెంకటరామిరెడ్డి, లావణ్య, ప్రతినిధులు రామరాజు, రంగారావు, కృష్ణకుమార్, నర్సింహరావు, సుబ్బరాజు, నాగశేషయ్య, ఫణికృష్ణ, మధుసూదన్రావు, నర్సింహం, శ్రీనివాసరావు, మోహన్రావు, అనూష, హారిక, గోపాల్రెడ్డి, చంద్రికప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.