బండ్లగూడ : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్ గ్రామానికి చెందిన సిద్దుయాదవ్ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ మేరకు ఆ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో బీజేఎంసీ టీఆర్ఎస్ అధక్షుడు సురేశ్గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు మల్లేశ్యాదవ్, నాయకులు పాపయ్య యాదవ్, జగదీశ్, రాజు, ప్రవీణ్గౌడ్, నవీన్ తదితరులు ఉన్నారు.