శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు ప్రకాశ్ గౌడ్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యమందించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
శంషాబాద్ మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన అంకం శంకరయ్యకు 60వేల రూపాయలు, మైల కుమార్కు 38వేల రూపాయలు, ఎం. లక్కి 60వేల రూపాయలు, ఎం. రాంజీ 44వేల రూపాయలు, ఎండీ అప్రోస్ 56 వేల రూపాయలు చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దిద్యాల శ్రీనివాస్, టి యాదగిరి, ఉప సర్పంచ్ వెంకటయ్య, బిక్యానయక్, దిద్యాల ఆశోక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సంహ, కుమార్ యాదవ్, విద్యచరణ్, గౌతమ్,రాజు, శేఖర్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.