గోల్నాక : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
కాచిగూడ నింబోలిఅడ్డకు చెందిన శివాజీకి రూ. 40వేలు, బాగ్అంబర్పేటకు చెందిన ఉషారాణికి రూ.16వేల 5వందలు, హియాయత్నగర్కు చెందిన శ్రీనివాసరావుకు రూ.60వేలు, అంబర్పేట దుర్గానగర్కు చెందిన రవీందర్కు రూ. 24వేలు, అంబర్పేట పటేల్నగర్కు చెందిన సంతోష్కు రూ.20వేలు, గోల్నాక తులసీనగర్ కాలనీకి చెందిన రత్నమ్మకు రూ. 44వేలు, అంబర్పేట పటేల్నగర్కు చెందిన సత్యనారాయణకు రూ. 18వేలు మంజూరయ్యాయి.
అలాగే గోల్నాక ఫిష్మార్కెట్కు చెందిన శివకుమార్కు రూ. 24వేలు, కాచిగూడ సుందర్నగర్కు చెందిన షేక్ జమీల్కు రూ. 40వేలు, అంబర్పేట పటేల్నగర్కు చెందిన శివకుమార్కు రూ. 60వేలు, మొత్తం రూ.3లక్షల56వేల5వందల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.