అమీర్పేట : అర్హులైన ప్రతిఒకరు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి నుండి లబ్దిపొందేలా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్నగర్కు చెందిన యాదగిరి గౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై పలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది.
నిరుపేద కుటుంబానికి చెందిన యాదగిరి గౌడ్కు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్ధిక లబ్ది చేకూరేలా సనత్నగర్ కార్పొరేటర్ దంపతులు కొలను లక్ష్మి బాల్రెడ్డి చొరవ తీసుకుని మంత్రి తలసానితో సిఫారసు చేయించడం జరిగింది. ఆ విధంగా సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 2లక్షల చెక్కును గురువారం ఉదయం తన నివాసంలో లబ్దిదారు యాదగిరి గౌడ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.