మన్సూరాబాద్ : ఎల్బీనగర్, నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడలోని పీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో బుధవారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, వక్త జూలూరు గౌరీశంకర్, సత్యవతి దంపతుల కుమార్తె సాహితి వివాహం నర్సింహాచారి, నాగరాణి దంపతుల కుమారుడు అరుణ్తో అంగరంగ వైభవంగా జరిగింది.
వివాహ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన వదూవరులు సాహితి, అరుణ్ను ఆశీర్వదించారు. వివాహానికి హాజరైన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్రెడ్డి, నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.