బండ్లగూడ : ముఖ్యమంత్రి సహయ నిధి నిరు పేదలకు ఎంతో వరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. హిమాయత్ సాగర్ గ్రామానికి చెందిన వేముల గణేష్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆర్ధిక సహయం కోసం స్థానిక టీఆర్ఎస్ నాయకులు చేగురి రాజు, వేముల పరమేష్, యాదగిరిల సహకారంతో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సమక్షంలో ముఖ్యమంత్రి సహయనిధికి దరఖాస్తు చేసుకున్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అదివారం బాధితులకు ముఖ్యమంత్రి సహయ నిధి నుంచి వచ్చిన ఎల్వోసీని అందజేశారు.