శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషా బాద్ మండలం పెద్దతూప్రకు చెందిన బేగరి చెన్నయ్య అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ ఎమ్మెల్యేకు తెలుపడంతో వెంటనే రూ.5 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి గురువారం చెక్కును అందజేశారు.
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పేదలకు వైద్య ఖర్చుల కోసం సహాయం అందించడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్గౌడ్, దిద్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, హనుమంతు, పెద్దతూప్ర గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.