పహాడీషరీఫ్: ఆపదలో ఉన్న సమయంలో ఆదుకునేందుకు సీఎం సహాయనిధి పేదలకు ఎంతో దోహదపడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రమాదాల్లో గాయపడి చికిత్స చేయించుకుని చితికిపోయిన జీవితాలకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
జల్పల్లి మున్సిపాలిటీ వార్డు 10లోని వాది ఉమర్ కాలనీలో నివాసముంటున్న సైయ్యద్ అజీజ్ గత ఐదు నెలల క్రితం అనారోగ్యంతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 10వ వార్డు కౌన్సిలర్ శంషోద్దీన్ సహాయంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. సీఎంఆర్ ఎఫ్ నుంచి రూ. 60వేలు మంజూరు కాగా చెక్కును గురువారం బాధితుడికి మంత్రి అందజేశారు.