కాచిగూడ : చెన్నై ఎగ్మోర్ రైల్లో ప్రయాణిస్తున్న ఆర్మీ ఉద్యోగికి చెందిన ఖరీదైన సెల్ఫోన్ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కేరళ, త్రివేండ్రంలోని అమరవిల్లా గ్రామానికి చెందిన దేవకుమార్ (31) బీ అండ్ సీలో ఆర్మీ ఉద్యోగి.
రెండు రోజుల క్రితం చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్లో ఎగ్మోర్ రైలు ఎక్కి కాచిగూడ రైల్వేస్టేషన్కు వస్తుండగా మార్గ మధ్యలో పుత్తూరు రైల్వేస్టేషన్లో రైలు ఆగింది. స్టేషన్ దాటిన అనంతరం బ్యాగులో చూసేసరికి ఖరీదైన సెల్ఫోన్ కన్పించలేదు. గురువారం కాచిగూడ రైల్వే పోలీసులకు దేవకుమార్ పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం పుత్తూరు రైల్వే పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బీజీ ప్రసాద్ తెలిపారు.