బండ్లగూడ: నియోజకవర్గంలో అన్ని కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవలసిన అవసరం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతినగర్ ఫేస్ 4లో కార్పొరేటర్ సంతోషి రాజిరెడ్డి తన సొంత నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
శనివారం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్ఛేసి మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటి మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డిలతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సీసీ కెమెరాలు నేర నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు.
పోలీస్ శాఖ వారు కూడ సీసీ కెమెరాల పట్ల అవగాహనను కల్పిస్తున్నారని ప్రతి ఇంటికి కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై అన్వేశ్రెడ్డి, కార్పొరేటర్లు చంద్రశేఖర్, రవీందర్రెడ్డి, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, చెవెళ్ల యాదిరెడ్డి, హైదర్షాకోట్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు సదానంద్గౌడ్ పాల్గొన్నారు.