కవాడిగూడ : ఉత్తరప్రదేశ్ లిఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో రైతు సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 12ను రైతు అమరవీరుల దినంగా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ కొన్వొత్తుల ప్రదర్శనను చేపట్టారు.
లిఖింపూర్ మృతులతో పాటు గత 10 నెలలుగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పొయిన 636 మంది రైతులకు వారు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్సీసీ రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్, పశ్యపద్మ, రాయల చంద్రశేఖర్, అచ్యుత రామారావు, వల్లపు ఉపేందర్ రెడ్డి, కన్నెగంటి రవి, జక్కుల వెంకటయ్యలు మాట్లాడారు.
యూపీలో దారుణంగా రైతులపై పాశవికంగా వ్యవహరించిన కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.