మాదాపూర్ : స్పా ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న భవనాన్ని మంగళవారం మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారు. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… మాదాపూర్ అరుణోదయ కాలనీ ప్రభావతి ప్లాజా నాల్గవ అంతస్తులో వ్యభిచారం నిర్వహిస్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మార్చి నెలలో మాదాపూర్ పోలీసులు దాడి చేసి నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించి, బాధిత మహిళలను రెస్క్యూ హోం కు తరలించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మాదాపూర్ పోలీసులు ప్రభావతి ప్లాజాలోని నాల్గవ అంతస్తును సీజ్ చేశారు. స్పా ల పేరిట అక్రమ పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు.