శంషాబాద్ రూరల్ : గ్రామాలకు బొడ్రాయిలు మూలస్థంభాలుగా పిలుస్తారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలోని జూకల్ గ్రామంలో గతమూడు రోజుల నుంచి బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు స్థానిక సర్పంచ్ నర్సమ్మ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
చివరి రోజు ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బొడ్రాయి ఊరిమద్యలో ఉంటు గ్రామ ప్రజలకు కంటికిరెప్పల కాపాడు తుందన్నారు. అలాంటి బొడ్రాయి గ్రామంలో పూర్వకాలం నుంచి ఉంటుందన్నారు.
కొన్ని గ్రామాలలో మనుగడలో లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలు కలిసి నూతనంగా ప్రతిష్టాపన చేస్తున్నారు. జూకల్ గ్రామంలో సర్పంచ్ నర్సమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినంధనీయమన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి తన్విరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి,నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, పార్టీ నాయకులు నీరటి రాజు ముదిరాజ్, సత్యనందంతో పాటు పలువురు నాయకులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.