ఖైరతాబాద్ : మాజీ సీఎల్పీ నేత దివంగత పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) జయంతి వేడుకలను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పీజేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఖైరతాబాద్, లైబ్రరీ చౌరస్తాల్లోని పీజేఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి, కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు.
అనంతరం పంజాగుట్ట కుమ్మరిబస్తీలో రక్తదానం శిబిరం, ఖైరతాబాద్లో పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గజ్జెల అజయ్, సత్యనారాయణ, ఎం. మహేశ్ యాదవ్, కరాటే రమేశ్, మహేశ్, శ్రీనివాస్ యాదవ్, కిశోర్ కుమార్, హరి, ఫీరోజ్ తదితరులు పాల్గొన్నారు.