బంజారాహిల్స్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫిబ్రవరి 16న బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..
60ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడంతో పాటు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 16న ఉదయం 10గంటలనుంచి తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లతో పాటు అన్ని డివిజన్లకు చెందిన కమిటీల నాయకులు ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.