ఉస్మానియా యూనివర్సిటీ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో హైదరాబాద్ ప్రజలను బీజేపీ వంచించిందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన బీజేపీకి ఆ హామీల అమలు పట్ల చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.
గ్రేటర్ ప్రజల సౌలభ్యం కోసం నిర్మించిన మెట్రో రైల్ తదుపరి దశ నిర్మాణాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. మెట్రో నగరాల సమగ్ర అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ నాయకుల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేంద్ర బడ్జెట్తో హైదరాబాద్ మహానగరంపై ఆ పార్టీ ప్రేమ బహిర్గతమైందని ఎద్దేవా చేశారు. బడ్జెట్తో దేశంలోని ఏ వర్గం ప్రజలకు కూడా మేలు చేకూర్చలేరని అన్నారు. ఆ బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తుల సంపదను పెంచేందుకే పనికొస్తుందని అభిప్రాయపడ్డారు.