మర్రిగూడ, డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆవిర్భవించిన 6 నెలల్లోనే వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ అందించారని అన్నారు. నీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులు ఉత్సాహంగా వరిని పండించారన్నారు. ఈ తరుణంలో ధాన్యం కొనలేమని కేంద్రం చేతులెత్తేసినందునే సీఎం కేసీఆర్ మహాధర్నా చేపట్టారని, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో రైతుల పక్షాన పోరాడుతున్నారని తెలిపారు. ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనకుండా కేంద్రం బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నందున సీఎం కేసీఆర్ రైతులను ఇతర పంటలు వేయాల్సిందిగా కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ సోమవారం జరిగే నిరసన కార్యక్రమంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు చావుడప్పులతో శవయాత్ర నిర్వహించి దహనం చేయాలని సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, సర్పంచులు నల్ల యాదయ్య, కుంభం నర్సమ్మామాధవరెడ్డి, ఊడుగు అంజయ్యగౌడ్, మెగావత్ లాలూనాయక్, పార్టీ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్యాదవ్, నాయకులు బచ్చు రామకృష్ణ, లపంగి నర్సింహ, వెంకటయ్యగౌడ్, వెంకటయ్య, యాదగిరి, సైదులు, నాగరాజు, వెంకటేశ్, రాజుగౌడ్, నర్సిరెడ్డి, గోపీనాయక్ పాల్గొన్నారు.