శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్-టిప్పర్ ఢీకొని బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…నగర శివారు లోని కర్మన్ఘాట్ కు చెందిన కె. నారాయణరెడ్డి(52) బైక్పై శంషాబాద్ వస్తున్నాడు.
మార్గమధ్యంలో కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై అతివేగంలో వస్తూ స్పీడ్ బ్రేకర్పై అదుపుతప్పి ఎదురుగా వచ్చిన ఓ టిప్పర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తలపై హెల్మెట్ ఉన్నప్పటికీ ప్రమాదం తప్పలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.