సుల్తాన్బజార్ : కొవిడ్, బ్లాక్ ఫం గస్ విజృంభించినప్పుడు బాధితులకు అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) శస్త్రచికిత్సల నిపుణుల సంఘానికి ఉత్తమ అవార్డు లభించింది.
అఖిల భారత చెవి, ముక్కు, గొంతు సమాఖ్య ప్రతినిధులు బుధవారం కోఠిలోని ఈఎన్టీ దవాఖాన ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర సంఘాన్ని సత్కరించారు.
ఈ సందర్భంగా సంఘం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కే సతీశ్, కార్యదర్శి డాక్టర్ ఆర్ రమేశ్ మాట్లాడు తూ.. కరోనా, బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టీవీ, రేడియో, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినందుకు తెలంగాణ ఈఎన్టీ సంఘానికి ప్రథమ స్థానం లభించడంతోపాటు ఉత్తమ అవార్డు కూ డా లభించిందని తెలిపారు.
ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టీ శంకర్, డాక్టర్ సంపత్కుమార్, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ వెంకటరామ్రావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ సుదీప్, డాక్టర్లు రవిశంకర్, నాగరాజు, హమీద్ పాల్గొన్నారు.