విలువైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దు
చోరీలు నివారణకు సహకరించాలంటున్న పోలీసులు
హయత్నగర్, జనవరి 9 : దొంగతనాల నివారణకు ప్రజలు సహకరించాలని హయత్నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్ కోరారు. ఆదివారం హయత్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో ప్రచార ర్యాలీని ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్నగర్ పరిసర ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లేవారు తమ విలువైన ఆభరణాలు, నగదును ఇంట్లో పెట్టి వెళ్లరాదని, బ్యాంకు లాకర్లు, సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలన్నారు. ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కాలనీల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తూ కనిపించినట్లయితే వెంటనే 100కు సమాచారం అందించాలన్నారు. మహిళలు బయటకు వచ్చిన సమయంలో మెడలోని బంగారు ఆభరణాలు, పుస్తెలు జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. ఇంటికి లోపలివైపు నుంచి తాళాలు వేసి, చెప్పులు బయట వదిలిపెట్టేలా చూడాలని, పాలు, పేపర్ వేసే వాళ్లకు తాము ఉండటం లేదని ముందస్తు సమాచారం ఇచ్చి రావొద్దని చెప్పాలని సూచించారు. ఇంటికి ప్రధాన ద్వారం వద్ద తప్పకుండా లైట్లు వెలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్రావు, క్రైమ్ ఎస్ఐ నర్సింహ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించండి
మన్సూరాబాద్, జనవరి 9: మన్సూరాబాద్ డివిజన్ సహారాస్టేట్స్కాలనీలోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం కాలనీ మెయింటెనెన్స్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వనస్థపురం సీఐ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగకు సొంతూర్లకు వెళ్లే వారు తాము నగరంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లో నగదు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్ర పర్చుకోవాలని సూచించారు. సొంతూర్లకు వెళ్లే వారు తమ ఇంటి పరిసరాల్లో నివాసముండే వారితో పాటు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణాలు సాగిస్తున్న సమయంలో అపరిచితులు ఇచ్చే తినుబండారాలను తీసుకోవద్దని సూచించారు. పండుగల సమయంలో కాలనీల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే సమాచారం ఇవ్వాలని కోరారు. వనస్థలిపురం పీఎస్ డీఐ జగన్నాథ, అడ్మిన్ ఎస్సై చంద్రారెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్రెడ్డి, ఉపాధ్యక్షురాలు మంజుల, సభ్యులు కన్నా మహేశ్, వల్లూరిపల్లి పార్థసారధి, మేకల ప్రభాకర్రెడ్డి, రవిచంద్ర, వెంకటేశ్వర్లు, కిరణ్, తులసమ్మ, శీనయ్య, పెంటయ్య, నర్సింహ గౌడ్, రామయ్యగౌడ్, కట్టా వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వండి